జగిత్యాల, ఆగష్టు 15(Telangana Insight):జగిత్యాల పట్టణంలోని స్థానిక తహశీల్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహం చుట్టూ జాతీయ జెండాలతో ముస్తాబైంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అంబేడ్కర్ విగ్రహం చుట్టూ పలు పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నాయకులు జాతీయ జెండాను ఏర్పాటు చేసి, ఆవిష్కరించారు. విగ్రహం చుట్టూ త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుండగా, మధ్యలో అంబేడ్కర్ విగ్రహం కనిపిస్తున్న దృశ్యం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతున్న ఈ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది.

